
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తంగలాన్”. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే తంగలాన్ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ మొదటి పెటింది చిత్రయూనిట్. తాజాగా హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్ లో “తంగలాన్” సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ప్రతిసారీ నా సినిమాల ఈవెంట్ కు పెద్ద హీరోలు, స్టార్ దర్శకులు గెస్టులుగా వస్తుంటారు. ఈ సారి యంగ్ డైరెక్టర్స్, హీరోస్ వచ్చారు. వాళ్లు నా గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా పోస్టర్, ఫస్ట్ లుక్స్ చూశారు. తంగలాన్ మూవీ టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా.. నేను గతంలో నటించిన నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ లాంటి సినిమాల మాదిరిగానే తంగలాన్ కూడా ఒక డిఫరెంట్ మూవీ. మీకు టీజర్ చూస్తే అర్ధమయ్యే ఉంటుంది. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది.
ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత దర్శకుడు రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. తంగలాన్ సినిమాలో ఒక లైఫ్ ఉంటుంది. తంగలాన్ షూటింగ్ లో కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్ లో చేశాము. లైవ్ సౌండింగ్ లో చేసేవాళ్లం అని అన్నారు. అలాగే ఈ సినిమా నాకొక మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం. ఆ ప్రాంతం వాళ్లు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో..మేమూ అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ షూటింగ్ చేశాం అన్నారు.
నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం..మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్ లో కమర్షియల్ మూవీస్ తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్ గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో తంగలాన్ ఒకటి అవుతుంది. ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ..ఇకపైనా మేము సినిమాలు చేస్తాం. గతంలో బాలీవుడ్ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ తో మనం కూడా ఆస్కార్ గెల్చుకోవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి గారు. తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశాను. ఆ క్యారెక్టర్స్ లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు అనడం సరికాదు. అక్కడ తమిళ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన పరభాషా చిత్రాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారను తమిళ ఆడియెన్స్ బాగా ఆదరించారు అని చెప్పుకొచ్చారు విక్రమ్ .
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..