Akash Puri: ‘నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను’.. ఆకాష్ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Jun 26, 2022 | 7:10 PM

స్టార్ దర్శకుడు పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Akash Puri: నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను.. ఆకాష్ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Akash
Follow us on

స్టార్ దర్శకుడు పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి(Akash Puri) హీరోగా తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో ”దళం”, “జార్జ్ రెడ్డి” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. గెహనా సిప్పీ నాయికగా నటించిన యూవీ క్రియేషన్స్సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్
తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ..

మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. అలాగే సంగీతం,
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి టెక్నీషియన్స్ అంతా ప్రతిభ చూపించారు. నా గత రెండు చిత్రాల కన్నా చోర్ బజార్ గ్రాండ్ గా ఉందని చెబుతున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు. నాకు ఈ సినిమా బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చింది. అన్నారు. అలాగే దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..చోర్ బజార్ తో ఒక కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలన్న మా ప్రయత్నం ఇవాళ సక్సెస్ అయ్యింది. అన్ని ప్లేస్ ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను ఫస్ట్ టైమ్ ఒక కమర్షియల్ సినిమా చేశాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. ఆకాష్ తో పాటు మిగతా టీమ్ అంతా నాకెంతో సపోర్ట్ చేశారు. ఇకపైనా మంచి కమర్షియల్ చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి