Chiranjeevi: చిరంజీవి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఓ టాలీవుడ్ నటుడి కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్

|

Aug 22, 2024 | 11:59 AM

సోషల్ మీడియాలో మెగా అభిమానుల హంగామా మాములుగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అదే. ఇందులో చిరంజీవి చేతిలో క్యూట్ గా ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ. పాకెట్ మనీ కోసం ఒక కేఫ్ లో పని చేసిన ఆమె..

Chiranjeevi: చిరంజీవి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఓ టాలీవుడ్ నటుడి కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగపెట్టారు. గురువారం (ఆగస్టు 22) ఆయన 69వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో సినీ ప్రముఖులే కాకుండా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు టాలీవుడ్ బాస్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మెగా అభిమానుల హంగామా మాములుగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అదే. ఇందులో చిరంజీవి చేతిలో క్యూట్ గా ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ. పాకెట్ మనీ కోసం ఒక కేఫ్ లో పని చేసిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. బుల్లితెరపై బాగా ఫేమస్ అయిన ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించింది. తన ముద్దు ముద్దు మాటలతో ఆడియెన్స్ కు చేరువైంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫీల్ గుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా నిర్మాతగా అవతారమెత్తింది. యువ నటీనటులకు అవకాశం కల్పిస్తూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇటీవల ఆమె నిర్మించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఏకంగా 11 మంది కొత్త హీరోలు, 4 గురు హీరోయిన్లు నటించడం విశేషం. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ అమ్మాయి మరెవరో కాదు మెగా డాటర్ నిహారిక కొణిదెల. చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనతో దిగిన పలువురి సెలబ్రిటీల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో భాగంగానే చిరంజీవితో నిహారిక దిగిన పాత ఫొటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది

మెగా ఫ్యామిలీ వారసత్వంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిహారిక. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే పెళ్లయ్యాక మాత్రం నటనకు స్వస్తి చెప్పేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలు మళ్లీ ఆమెను ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాయి. విడాకుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిహారిక నిర్మాతగా మారింది. కొన్ని సినిమాల్లో నటిస్తూనే, నిర్మాతగానూ కంటిన్యూ అవుతోంది. ఇటీవల 11 మంది కొత్త నటీనటులతో కమిటీ కుర్రోళ్లు అనే సినిమా నిర్మించింది. యదు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇక నటిగా వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తోంది నిహారిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.