అభిమాన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నిత్యం ఆసక్తి చూపిస్తుంటారు ఫ్యాన్స్. గతంలో న్యూస్ పేపర్స్.. ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే తమ ఫేవరేట్ సార్ట్స్ గురించి తెలిసేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అంతేకాదు తమ ఫేవరేట్ హీరోలతో నెట్టింట ముచ్చట్లు.. లైవ్ వీడియోస్ ద్వారా మరింత దగ్గరవుతున్నారు అభిమానులు. ఇక తమ ఫాలోవర్లతో టచ్ లో ఉండేందుకు సెలబ్రెటీలు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ తెగ ఫేమస్ అయ్యింది. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్.. అరుదైన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోకు సంబంధించిన చిన్ననాటి పిక్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
పైన ఫోటోను చూశారు కదా.. అందులో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. గుర్తుపట్టండి. అతను ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడు. అమ్మాయిల ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన నటనతో తెలుగు తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతను మరెవరో కాదండి.. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. దివంగత హీరో అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. నిన్నే పెళ్లడతా సినిమాతో నాగార్జున క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ మూవీతో నాగార్జునకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన వయసు 63. అయినా.. ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నారు. ఇటీవల ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగార్జున. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.
Congrats to @ktrtrs garu, @telanganacmo, @HMDA_Gov & Anil Chalamalasetty for bringing, the first-ever #NetZero sport since inception, #FormulaE to #Hyderabad, #India. Let’s make history near the picturesque Hussain Sagar Lake at #GreenkoHyderabadEPrix on February 11! @acenxtgen pic.twitter.com/J2VjBV8eMl
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 26, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.