Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. స్టార్ హీరోతో ప్రేమ వివాహం.. ఎవరో గుర్తు పట్టారా?

|

Jul 31, 2024 | 3:06 PM

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ పాప మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు.

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. స్టార్ హీరోతో ప్రేమ వివాహం.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress Childhoood Photo
Follow us on

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ పాప మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. పేరుకు బాలీవుడ్ నటి అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగు నాట కూడా ఫుల్ క్రేజ్ ఉంది. మహేశ్ బాబు, రామ్ చరణ్ లతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ త్వరలోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అది కూడా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాతో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండోసారి జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ. బుధవారం (జులై 31) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కియారాకు బర్త్ డే విషెస్ తెలిపారు. అదే క్రమంలో ఆమెకు సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. అయితే మార్చుకోమని సల్మాన్ ఖాన్ కియారాకు సలహా ఇచ్చాడట. ఈ సూచనకు కియారా అంగీకరించింది. తన పేరును అలియాకు బదులుగా కియారాగా మార్చుకుంది. కియారా ముంబైలో చదువుకుంది. కియారా అద్వానీకి ‘కబీర్ సింగ్’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది కాకుండా ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. సిద్ధార్థ్, కియారా జంటగా నటించిన చిత్రం ‘షేర్షా’. వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఈ సినిమానే కారణం. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా, సిద్ధార్థ్ తమ పుట్టినరోజు కోసం విహారయాత్రకు వెళ్ళినట్లు సమాచారం. కాగా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది కియారా అద్వానీ. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే మూవీతో మనల్ని పలకరించేందుకు రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కియారా అభిమానుల గొప్ప మనసు.. పిల్లలకు చాక్లెట్స్, స్వీట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి