Mogali Rekulu Serial: ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ కీర్తన గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

ముఖ్యంగా ఇందులోని ఆర్కే నాయుడు, మున్నా, శాంతి, సెల్వ, దేవి పాత్రలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇందులో ఒకే అమ్మాయి రెండు విభిన్న పాత్రలు పోషించింది. అందులో తన అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

Mogali Rekulu Serial: 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ కీర్తన గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
Mogali Rekulu
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:49 PM

బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంవత్సరాలపాటు టెలివిజన్ రంగంలో టీఆర్పీ రేటింగ్‏లో మొదటిస్థానంలో నిలిచింది. ఈ సీరియల్‏కు అప్పట్లో అభిమానులు ఎక్కువే ఉండేవారు.. అప్పుడే కాదు… ఇప్పుడు కూడా యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్న ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది ఈ సీరియల్ కు ఏరేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో. మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్ దాదాపు మూడేళ్లు సాగింది. ఇప్పుడున్న రోటీన్ స్టోరీగా కాకుండా..ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠభరితంగా.. ట్విస్ట్స్.. సస్పెన్స్.. ఎమోషన్స్.. లవ్.. ఇలా అన్ని కలగలపిన ఈ సీరియల్ కు యూత్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని ఆర్కే నాయుడు, మున్నా, శాంతి, సెల్వ, దేవి పాత్రలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇందులో ఒకే అమ్మాయి రెండు విభిన్న పాత్రలు పోషించింది. అందులో తన అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

మొగలిరేకులు సీరియల్లో కీర్తన.. సింధు.. రెండు విభిన్న పాత్రలలో కనిపించిన అమ్మాయి మేధా. ఇప్పటికీ బుల్లితెర ఆడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. ఈ సీరియల్ కంటే ముందు మేధా చక్రవాకం ధారావాహికలో కనిపించింది. మొగలిరేకులు తర్వాత అపరంజి, సూర్య పుత్రుడు సీరియల్స్ చేసిన మేధా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. మేధా చివరిగా రాజేంద్రప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి చిత్రంలో కనిపించింది.

ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. బుల్లితెరకు పరిచయం కాకముందే మేధా పలు ప్రకటనలు చేసింది. సినిమాల తర్వాత మేధా.. సుమిత్ అనే సాఫ్ట్ వేర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం మేధా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడుపుతుంది.

ఇవి కూడా చదవండి
Medha

Medha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.