
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాంటివారిలో వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ .
ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళంలోనూ సినిమాలు చేస్తుంది అనుపమ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో చాలా పద్దతిగా స్కిన్ షోకు నో చెప్తూ సినిమాలు చేసింది అనుపమ. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ హద్దులను చెరిపేస్తుంది. డోస్ పెంచేసి గ్లామర్ షో చేస్తుంది.
సినిమాల విషయం అనుపమ చాల జాగ్రత్తగా ఉంటుంది. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు 2 సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట అనుపమ. ఇక సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ వయ్యారి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ కోటిరూపాయల వరకు రెమ్యునరేషన్ వసూల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.