AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ మాజీ ప్రధాని మనవరాలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ఈ అందాల భామ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్రనటులతో కలిసి నటించింది. అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను తన సొంతం చేసుకుంది. సుమారు 30 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న ఈమెకు.. వ్యక్తిగత జీవితం మాత్రం ఓ చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఏకంగా 12 మందితో ఎఫైర్, ఆపై పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఇలా జరగరానివి అన్ని జరిగాయి.

నేపాల్ మాజీ ప్రధాని మనవరాలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 10:53 AM

Share

నేపాల్ లో విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నేపాల్‌ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. అల్లర్లు చెలరేగాయి. ప్రధాని కె.పి. ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేసి అదృశ్యమయ్యారు. అక్కడి వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇదిలా ఉంటే నేపాల్ మాజీ ప్రధానమంత్రి మనవరాలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసింది. బడా హీరోల సినిమాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న ఆ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన కనిపిస్తున్న బ్యూటీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ నటి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ స్టార్ హీరోయిన్ చావు అంచుల వరకు వెళ్లొచ్చింది. ఎంతో ధైర్యంతో ఆమె చావును కూడా ఎదిరించింది. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు. మనీషా కొయిరాలా.  1970లో నేపాల్ లో జన్మించిన మనీషా.. ఆమె నేపాలీ చిత్రం ఫేరి భేతౌలా (1989)తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయాణం స్టార్ట్ చేసింది.. 1991వ సంవత్సరంలో, నటి మనీషా కొయిరాలా చౌధాకర్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మనీషా కొయిరాలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇక ఆమె నటించిన బొంబాయి, ఒకేఒక్కడు, భారతీయుడు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా మనీష పేరు మారుమ్రోగింది. కాగా మనీష క్యాన్సర్ తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే.2012లో మనీషా అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంది. అది కూడా బాలీవుడ్ లోనే ఆమె నటిస్తుంది . రీసెంట్ గా హీరామండి సినిమాలో చేసింది. అలాగే కొన్ని సినిమాలు చేస్తుంది.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే