Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్‏గా నటిస్తోండగా.. డైరెక్టర్ కొరటాల శివ

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..
Acharya

Updated on: Jan 06, 2022 | 11:41 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్‏గా నటిస్తోండగా.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తోన్న ఈమూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఆచార్య సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఆచార్య సినిమాలోని స్పెషల్ సాంగ్ పై ఇప్పుడు సరికొత్త వివాదం మొదలైంది.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సానా కష్టం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్ రెజీనా నటించగా.. చిరు డ్యాన్స్‏కు అభిమానులు ఫిదా అయ్యారు. కాలం గడిచిన అన్నయ్య ఎనర్జీలో మాత్రం మార్పు రాలేదంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సానా కష్టం పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాట రచయిత, దర్శకుడి పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కోన్నారు. సానా కష్టం పాటలోని “ఏడేదో నిమరచ్చని కుర్రోళ్లు ఆర్ఎంపీలు అయిపోతారనే” అభ్యంతరంగా ఉందంటూ ఆర్ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..

Loading...
Unable to load recommendations.
Follow Us