Tollywood: ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెల్సా

|

Oct 05, 2024 | 1:00 PM

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్లు.. వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు.

Tollywood: ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెల్సా
Tollywood
Follow us on

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్లు.. వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. ఇంతకీ వారెవరో కనిపెట్టగలిగారా.? 90వ దశకంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. వారు మరెవరో కాదు.. నగ్మా, జ్యోతిక, రోషిని. ఇక ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఉన్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి.

‘ఘరానా మొగుడు’ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది నగ్మా. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారని చెప్పొచ్చు. అప్పట్లో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక నగ్మా సిస్టర్లు అయిన జ్యోతిక, రోషినితో కూడా చిరంజీవి కలిసి నటించారు. ‘మాస్టారు’ సినిమాలో రోషిని హీరోయిన్‌గా నటించగా.. వి.వి.వినాయక్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది.

ఇక ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు వశిష్ట రూపొందిస్తోన్న ఈ చిత్రంలో త్రిష, అషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి