ఓటీటీలోకి బాస్ బ్లాక్ బస్టర్ మూవీ.. మన శంకర వరప్రసాద్ గారు అప్డేట్ ఇదిగో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా విదులైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటించారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ దుమ్మురేపింది ఈ సినిమా.. సుమారు రూ. 500కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా దూసుకుపోతుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా చూసి మరోసారి ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 తెలుగు మన శంకర వరప్రసాద్ గారు సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది.
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది జీ 5 తెలుగు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బాస్ ఈస్ కమింగ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో సినిమా రావచ్చు అని అభిమానులు అంచనావేస్తున్నారు. కాగా త్వరలో మన శంకర వరప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
