AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మరోసారి విలన్‏గా సంజయ్ దత్.. ఈసారి ఏకంగా సూపర్ స్టార్‏నే ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్ ?..

మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో జపాన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu: మరోసారి విలన్‏గా సంజయ్ దత్.. ఈసారి ఏకంగా సూపర్ స్టార్‏నే ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్ ?..
Sanjay Dutt, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2022 | 7:45 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. తర్వలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మరో కథానాయికగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కనిపించనుందని టాక్ వినిపించింది. తాజాగా మరో అప్డేట్ వైరలవుతుంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ ఉంటుందని.. ఈ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‏ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. మహేష్ ను ఢీకొట్టే పాత్ర పవర్ ఫుల్ ఉంటుందని.. ఆరోల్ కు సంజయ్ దత్ అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే ఆయనతో చర్చలు జరపనున్నారట. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సంజయ్.. తనకు సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని.. అవకాశం వస్తే మరిన్ని చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇవ్వడంతో ఆయనకు ఆఫర్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో జపాన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Follow Us