Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో డేటింగ్! జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్

|

Jul 31, 2024 | 6:21 PM

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో పాటు డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో ఆమె ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ వీరిద్దరూ జంటగానే దర్శనమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుశీల్ కుమార్ షిండేకు మరో మనవడు కూడా ఉన్నాడు.

Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో డేటింగ్! జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్
Manushi Chhillar
Follow us on

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో పాటు డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో ఆమె ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ వీరిద్దరూ జంటగానే దర్శనమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుశీల్ కుమార్ షిండేకు మరో మనవడు కూడా ఉన్నాడు. అతనే నటుడు వీర్ పహారియా. ఇప్పుడు అతనితో ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీ హీరోయిన్ మానుషి చిల్లర్. ఇందులో వరుణ్ కు తోడుగా రాడార్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుందీ అందాల తార. అయితే సినిమా విజయం సాధించకపోడంతో మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో దూసుకెళుతోంది మానుషి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ మాజీ విశ్వ సుందరి కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
బాలీవుడ్ నటుడు వీర్ పహారియాతో మానుషి లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో ఈ జంటకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.

ఇటీవల జాన్వీ కపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా, స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అయితే ఇందులో మానుషి, శిఖర్ సోదరుడు వీర్ పహారియా జంటగా కనిపించారు. వీర్ భుజంపై మానుషి సేద తీరుతూ కనిపించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్‌ పహారియా కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం జాన్వీ కపూర్ కు మానుషి చిల్లర్ తోడి కోడలుగా వెళ్లినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్‌ పృథ్వీరాజ్‌లో నటించింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. ప్రస్తుతం మానుషి ఆశలన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి.

మానుషి చిల్లర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.