Singer Janaki: మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే.. ఎందుకో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో జానకమ్మది ప్రత్యేక నేపథ్యం. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడారు. ఎందరో దిగ్గజ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. అయితే ఒక సందర్భంలో జానకి మహానటి సావిత్రి సినిమాలకు పాటలు పాడనని తెగేసి చెప్పారు. చివరి వరకు కూడా అదే మాట మీద నిలబడ్డారీ లెజెండరీ సింగర్.

లెజెండరీ గాయని ఎస్. జానకి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ దిగ్గజ గాయని మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంగీత ప్రియులైతే జానకమ్మ పాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు స్వర నివాళి అర్పిస్తున్నారు. జానకమ్మ గాన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో నూ పాటలు పాడారు జానకమ్మ. ఏడు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారామె. ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకుల దగ్గర పనిచేసి తన గాన ప్రతిభతో స్వర కోకిల, గాన కోకిల అని బిరుదులు సొంతం చేసుకున్నారు. అయితే తన జీవిత కాలంలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలకు పాటలు పాడిన జానకమ్మ ఒక సందర్భంలో మహానటి సావిత్రి పాడనని శపథం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జానకమ్మనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు
వివరాల్లోకి వెళితే.. సావిత్రి సినిమాలకు ఎక్కువగా పి. లీల, పి. సుశీల పాటలు పాడేవారు. ముఖ్యంగా ఆమె హావభావాలకు, నటనకు సుశీలమ్మ గొంతు మాత్రమే సరిగ్గా బాగా సరిపోతుందని సావిత్రి గట్టిగా నమ్మేవారు. దీంతో తన సినిమాలకు సుశీల మాత్రమే పాడాలనే నియమం పెట్టుకున్నారట సావిత్రమ్మ. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ ఓ తమిళ సినిమాలో సావిత్రి పాటను ఆలపించారు. పాట కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది. అయితే సావిత్రం మాత్రం జానకమ్మ పాడిన పాటను పక్కన పెట్టి మళ్లీ సుశీలమ్మతో పాడించి రీ రికార్డింగ్ చేయించారు. దీంతో నొచ్చుకున్న జానకమ్మ అప్పటి నుంచి సావిత్రి పాటలను పాడకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో జానకమ్మ మాట్లాడుతూ.. ‘సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేవారు కాదు. అలా ‘నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను’ అనిచెప్పేశాను. సావిత్రి సినిమా కావడంతో ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని దర్శక నిర్మాతలు చెప్పడంతోనే పాడటానికి అంగీకరించాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది’ అని అన్నారు. జానకమ్మ మరణం నేపథ్యంలో ఇప్పుడీ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




