AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidimba: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. హిడింబ స్ట్రీమింగ్ ఎప్పుడంటే

తాజాగా ఓ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా ఏదో కాదు హిడింబ. యాంకర్ ఓంకార్ తమ్మడు అశ్విన్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాజుగారి గది అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 20 జులైన థియేటర్స్ లోకి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది.

Hidimba: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. హిడింబ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Hidimba
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2023 | 8:18 AM

Share

ఓటీటీ పుణ్యమా అని థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను ఆదరించడానికి డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయినా ఎనిమిది వారాలకు ఓటీటీలోకి రావడాలి కానీ కొన్ని సినిమాలు మాత్రం ఊహించని విధంగా ఓటీటీలో రిలీజ్ అయ్యి షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఓ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా ఏదో కాదు హిడింబ. యాంకర్ ఓంకార్ తమ్మడు అశ్విన్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాజుగారి గది అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 20 జులైన థియేటర్స్ లోకి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కొత్త దర్శకుడు అనిల్ క‌న్నెగంటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుంది. జులై 20న హిడింబ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్‌లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈమూవీ నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్టు 10న ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అఫీషియల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో హిడింబ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో అశ్విన్ పోలీస్ ఆఫిసర్ గా నటించాడు. అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ ట్రైనింగ్ లో ఉండ‌గా ప్రేమించుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది.. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా చేస్తుంటాడు. అనుకోకుండా ఈ ఇద్దరు కలిసి ఒక కేసు కోసం తిరిగి కలుస్తారు . సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్నప్ లు జరుగుతుంటాయి. అయితే చాలా కష్టపడి అమ్మాయిలను కిడ్నప్ చేస్తున్న ముఠాను పట్టుకుంటారు ఈ ఇద్దరు. అయితే కేసు ముగిసిపోయిందని అంతా అనుకుంటారు. కానీ అదే సమయంలో మరో అమ్మాయి కిడ్నప్ అవుతుంది. దీంతో కేసు మళ్లీ మొద‌టికొస్తుంది. అయితే ఇంతలో అసలు విషయం తెలుస్తోంది. అయితే తాము కాపాడిన అమ్మాయిలు కాకుండా ఇంకా చాలా మంది కిడ్నప్ అయ్యారని అది వేరే ముఠా అని తెలుస్తోంది. ఆ నేరస్థుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకుంటున్న‌ట్లు ఆద్య క‌నిపెడుతుంది. ఈ క్ర‌మంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. దాంతో ఊహించని షాక్ తగులుతుంది. వాళ్ల‌ను అత‌నేం చేస్తున్నాడు.? ఈ క‌థ‌కు ఆదిమ తెగ‌కు ఉన్న సంబంధం ఏంటి.? అన్నది సినిమా చూడాల్సిందే.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?