AnushkaShetty: అనుష్క సినిమానుంచి అప్డేట్ వచ్చేసింది.. స్వీటీ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే
అందాల భామ అనుష్క.. వెండి తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది
AnushkaShetty: అందాల భామ అనుష్క.. వెండి తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది. అనుష్క దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే తమిళ్ లోనూ అనుష్క సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. క్యారెక్టర్ కోసం తన శరీరాకృతిని మార్చుకోని బొద్దుగా మారిపోయింది. అరుంధతి, బాహుబలి, సైజ్ జీరో, భాగమతి వంటి చిత్రాల్లో తన నటన పరంగా అనుష్క సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఇక ఈ అమ్మడు చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులనుబ ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలో అనుష్క కీలకపాత్రలో కనిపించనుంది.
అయితే ఈ సినిమా ఆప్డేట్ కోసం అనుష్క ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని.. అందులో అనుష్క కూడా పాలు పంచుకుంటుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ నటించిన రారా కృష్ణయ్య సినిమాకు ఆయన దర్శకత్వం వహించాడు. UV క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకముందు ఇదే బ్యానర్ లో ‘మిర్చి’ ‘భాగమతి’ సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :