AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj : అతను స్టేజ్ పైకి వస్తే ఏం చేసేదాన్నంటే..హోలీ ఈవెంట్ ఘటన పై మరోసారి అనసూయ

తనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మార్చి 15 శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి రంగుల పండగలో మునిగి తేలారు. అలా అనసూయ కూడా ఒక హోలీ ఈవెంట్ లో పాల్గొంది.

Anasuya Bharadwaj : అతను స్టేజ్ పైకి వస్తే ఏం చేసేదాన్నంటే..హోలీ ఈవెంట్ ఘటన పై మరోసారి అనసూయ
Anasuya
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2025 | 11:16 AM

Share

అనసూయ భరద్వాజ్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

ఇక సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటుంది. అలాగే తనపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసేవారి పై కూడా ఫైర్ అవుతుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఓ హోలీ ఈవెంట్ కు హాజరైంది. ఆ ఈవెంట్ లో ఓ వ్యక్తి ఆమెను ఆంటీ అని పిలిచాడు. దాంతో స్టేజ్ పై నుంచే అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దమ్ముంటే రా అంటూ సవాలు విసిరింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

తాజాగా మరోసారి దీని పై రియాక్ట్ అయ్యింది అనసూయ. సోషల్ మీడియాలో తాజాగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని హోలీ ఈవెంట్ లో ఏం జరిగింది.? అని ప్రశ్నించాడు. దాని ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. హాయ్.. ఫస్ట్ నాకు కోపం రాలేదు. కానీ అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. ఎవడో ముక్కు మొహం తెలియకుండా రాయడం.. తనవరకు వెల్లదులే అని టైప్ చేయడం, ఏదైనా మాట్లాడటం ఒక ఎత్తు అయితే . కానీ నా ఎదురుగగా ఉండి నా ముఖం మీద నన్ను ఏజ్ షేమ్ చేయాలనుకున్నా.. నన్ను ఇన్సల్ట్  చేయాలనుకున్న వారికి అట్లా చెప్పాల్సి వచ్చింది. నేనే కాదు ఏ అమ్మాయి అయినా.. ఏ వ్యక్తి అయినా సరే.. అలా చేయడం తప్పు  చెప్పాలని అనుకున్నా అంతే. పైకి వస్తే ఏం చేసేదానిని అంటే ఏం జరిగేది అనేది నేను ప్లాన్ చేసుకోలేదు.. అతను పైకి వస్తే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా..  అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.