OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులోకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో రావడానికి రెడీ అవుతుంది. గత నెల విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..
Ott Movie

Updated on: Mar 19, 2026 | 5:00 PM

ప్రస్తుతం థిఏయస్ర్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నారు. ఉగాది, రంజాన్ సెలవలు కలిసి రావడంతో సినిమాలు థియేటర్స్ తోపాటు ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల పుణ్యమా అని కొత్త సినిమాలు నెలరోజుల్లోనే అభిమానులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో ప్రతి శుక్రవారం విడుదలవుతుంటే.. ఆ సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి.ఇక ఇప్పుడు రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా హారర్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఇక ఇప్పుడు ఓ తెలుగు హారర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవవడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు అమరావతికి ఆహ్వానం. సురేఖ వాణి కూతురు సుప్రీత నటించిన మొదటి సినిమా ఇది. సుప్రీతతోపాటు ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠంనేని) డిపార్ట్‌మెంట్‌ నుంచి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. తన భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ), మరదలు భార్గవి (సుప్రిత)లతో కలిసి ప్రశాంతంగా గడుపుతుంటాడు. భార్గవికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి ఎక్కువ. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ దెయ్యం వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి… దమ్ముంటే అమరావతి అనే ఊరికి వచ్చి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయని లైవ్‌లో నిరూపించమని సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించి ఈశ్వర్ ఫ్యామిలీతో సహా అమరావతికి వెళ్తుంది భార్గవి. అక్కడ ఆ కుటుంబానికి ఎదురైన పారానార్మల్ అనుభవాలు ఏంటి? అసలు ఆ ఊరి జమీందారు వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్ నోర్హోన్హా) కథేంటి..? ఈశ్వర్ సస్పెన్షన్‌కి, ఈ ఊరికి ఉన్న లింక్ ఏంటి? అనే ట్విస్టుల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమా ఈ నెల 20న ( శుక్రవారం) ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలకానుంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us