అక్ష‌య్ మ‌రోసారి రూ.2 కోట్ల విరాళం..దేశానికి ఇలాంటి హీరోలే కావాలి..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఎంత‌ని చెప్తాం. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కొటొన్న స‌మ‌యంలో మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు అక్ష‌య్. తాజాగా లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ రియ‌ల్ హీరో. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు ఈ […]

అక్ష‌య్ మ‌రోసారి రూ.2 కోట్ల విరాళం..దేశానికి ఇలాంటి హీరోలే కావాలి..
Follow us

|

Updated on: Apr 28, 2020 | 10:51 AM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఎంత‌ని చెప్తాం. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కొటొన్న స‌మ‌యంలో మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు అక్ష‌య్. తాజాగా లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ రియ‌ల్ హీరో. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు.

అంతకముందు ఈ విషయంపై ట్వీట్ చేసిన అక్షయ్.. క‌రోనా క‌ట్ట‌డి విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన‌ హెడ్​ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సర్వ్​లకు నివాళి అర్పించి..వారి సేవ‌ల‌ను కొనియాడారు. పోలీస్ ఫౌండేషన్​కు తన ఫ్యాన్స్ ను విరాళం ఇవ్వాలని కోరారు. కాగా క‌రోనా క‌ట్ట‌డి కోసం ఏర్పాటు చేసిన‌ ప్రధానమంత్రి సహాయనిధికి ఇప్ప‌టికే రూ.25కోట్లు విరాళమిచ్చారు అక్షయ్. దీనితో పాటే ముంబై మున్సిపల్ కార్పోరేషన్​కు రూ.3 కోట్లు విరాళం అందించాడు. ఈ డ‌బ్బుతో ఉద్యోగులకు పీపీఈ కిట్స్, మాస్క్​లు, శానిటైజర్​లు అందించారు.