AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఇది కదా కావాల్సింది.. తలైవా కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. క్రేజీ కాంబో..

ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు రజినీ. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. ఈ సినిమా తర్వాత రజినీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.

Rajinikanth: ఇది కదా కావాల్సింది.. తలైవా కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. క్రేజీ కాంబో..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2024 | 6:28 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు రజినీ. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. ఈ సినిమా తర్వాత రజినీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ 171 సినిమా తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదివరకే ఈ సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. వచ్చే నెల జూన్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూట్ ప్రారంభించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో రజినీకి జోడిగా సీనియర్ నటి శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం నడుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈఏడాది నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్న గాన్.. ఇప్పుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే రిలీజ్ చేసిన నాగ్ పోస్టర్ ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.