ఐశ్వర్య కోసం చనిపోతానంటూ నెటిజన్ పోస్ట్..అమ్మడి రెస్పాన్స్…
తమిళంతో పాటు తెలుగు భాషలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. స్వశక్తితో సినీ పరిశ్రమలో ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల 'వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె పోషించిన 'సువర్ణ' పాత్ర తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో షేర్ చేశారు.
తమిళంతో పాటు తెలుగు భాషలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. స్వశక్తితో సినీ పరిశ్రమలో ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె పోషించిన ‘సువర్ణ’ పాత్ర తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫోటోని హీరోయిన్ త్రిషతోపాటు లక్షల మంది లైక్ చేశారు. లుక్ అదిరిపోయిందంటూ చాలామంది నెటిజన్లు చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఐశ్వర్యపై తనకున్న అమితమైన అభిమానాన్ని తెలుపుతూ కామెంట్ పెట్టాడు. ‘త్రిపురలో నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసం ప్రాణాలు కూడా ఇస్తా. మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో మీకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటి ఉంది. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్క’ అని పోస్ట్ చేశాడు.
అతడి వ్యాఖ్యలకు స్పందించింన ఐశ్వర్య అలాంటి మాటలు మాట్లాడొద్దని కోరింది. ’థ్యాంక్స్.. కానీ దయచేసి అలాంటి కామెంట్స్ చేయవద్దు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మనం బ్రతకడం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నానని చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే..నేనెప్పుడూ నీకు మంచి ఫ్రెండుగా ఉంటా. జాగ్రత్త’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం ఐశ్వర్య విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాపే రణసింగం మూవీలో నటించింది. లాక్డౌన్ తర్వాత ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇవేకాక ‘టక్ జగదీష్’, ‘తిట్టం ఇరందుస, ‘భూమిక’, ‘ధృవ్ నక్షత్రం’, ‘ఇదు వెదళం సొల్లుమ్ కాధై’, ‘ఇదం పొరుల్ యేవల్’ తదితర సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.