ఇండియన్ మూవీస్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఆయుష్మాన్ ఖురానా, టబూ, రాధికా ఆప్టే నటించిన అంథాధూన్ చిత్రం దక్షిణ కొరియాలో కూడా సందడి చేయనుంది. ఆగస్టు 28న ఆ దేశంలో విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. ఇక్కడ ఏకంగా 90 స్క్రీన్లపై ఈ చిత్రం రిలీజ్ కానుందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ను పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈచిత్రం విడుదలైన మూడు వారాల్లోనే చైనా దేశవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచిందని తెలిపాడు తరణ్. అంథాదూన్ చిత్రం భారత్లో మాత్రం అక్టోబర్లో విడుదల కానుంది. ఈ మూవీలో టాబు, ఆయుష్మాన్ ఖురానా ముఖ్యపాత్రలు పోషించగా, రాధికా ఆప్టే కూడా ఓ పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ డైరెక్టర్.