
ఈ మధ్యకాలంలో హీరోయిన్ సినిమాల్లో గ్లామర్ షోలకంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎం ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమ నటనతో మెప్పిస్తున్నారు. హీరోలకు సమానంగా పాత్రలను ఎంచుకుంటూ మెప్పిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ప్రతి ఏడాది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీ నటుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఏడాదికి సంబందించిన లిస్ట్ ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్స్ ను సైతం వెనక్కి నెట్టేసింది ఆ ముద్దుగుమ్మ.
2025 సంవత్సరానికి 30 ఏళ్లలోపు 30 మంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. లిస్ట్ లో స్టార్ హీరోయిన్స్ అందరిని ఓ యంగ్ బ్యూటీ వెనక్కి నెట్టేసింది. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న భామ ఎవరో కాదు అపర్ణ బాలమురళి. గత ఏడాది అపర్ణ బాలమురళి ధనుష్ దర్శకత్వం వహించిన నటించిన రాయన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే మలయాళంలో కిష్కింధ కాండం, రుద్రం సినిమాల్లోనూ నటించింది.
ఇక ఈ అమ్మడు 2020లో సుధా కొంగర దర్శకత్వంలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా ఆయనకు జంటగా నటించారు. ఈ సినిమాలో అద్భుతంగా నటించింది అపర్ణ. ఈ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి