AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

సినీరంగంలో సక్సెస్ కావడం అంత సులభమేమి కాదు. నటీనటులు, దర్శక నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు ఎన్నో సవాళ్లను, కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలో విజయవంతం అవుతారు. మరికొందరు ఊహించని విధంగా కెరీర్ దెబ్బతిని సినిమాలకు దూరమవుతుంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు తన సినీ ప్రయాణంలో ఎదురైనా కష్టాలను వెల్లడించారు.

Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..
Actor Srinivas
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2026 | 4:42 PM

Share

నటుడు శ్రీనివాస్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన ఎత్తుపల్లాలను, ముఖ్యంగా ఒక సినిమా పరాజయం ఆయన జీవితాన్ని ఎలా మార్చివేసిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2013 మే 10న విడుదలైన పాండవులు సినిమాలో వేణుమాధవ్‌తో కలిసి శ్రీనివాస్ హీరోగా నటించారు. ఈ సినిమా 15 మంది కమెడియన్లతో తెరకెక్కినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రారంభంలో 30 లక్షల బడ్జెట్‌తో అనుకున్న ఈ చిత్రం, పలు మార్పులు చేర్పులతో చివరికి 1.4 కోట్ల రూపాయలకు చేరింది. ఈ చిత్ర నిర్మాణం కోసం శ్రీనివాస్ తన యావత్ సంపాదనను ఖర్చుచేశారట. కానీ సినిమా పరాజయం పాలవ్వడంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

సినిమా పరాజయం తర్వాత శ్రీనివాస్ జీవితం అక్షరాలా రోడ్డున పడిందని చెప్పుకొచ్చారు. సుమారు ఆరు సంవత్సరాల పాటు గుంటూరులో ఒక హోటల్ నడుపుతూ, తన భార్య వంట చేస్తుంటే, తాను కప్పులు, ప్లేట్లు కడగడం, టీ సప్లై చేయడం, డబ్బులు తీసుకోవడం వంటి పనులు చేశానని ఆయన వెల్లడించారు. ఈ కష్టాల నుండి బయటపడి మళ్లీ సినీ రంగంలో నిలదొక్కుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ బాల్యం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. రెండవ తరగతి నుంచే నాటికలు, నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన తండ్రి పౌరాణిక ఆర్టిస్ట్ కావడం, రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడి పాత్రను పోషించడంతో నటన ఆయన రక్తంలోనే ఉందని తెలిపారు. చిన్నతనంలో పులి కథలు, ఝాన్సీ లక్ష్మీబాయి బుర్ర కథ, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, దుర్యోధనుడి ఏకపాత్ర, వీరపాండ్య కట్టబ్రహ్మన నాటకాలు వేశారు. ఎన్టీఆర్ సినిమాల నుండి ప్రేరణ పొంది, మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోలిన విధంగా కట్టబ్రహ్మన పాత్రను తాను ఎనిమిదవ తరగతిలోనే ప్రదర్శించానని వివరించారు. ఈ ప్రదర్శనలో రూథర్‌ఫోర్డ్‌ను తన్నే సన్నివేశం, డైలాగులు కూడా తాను ఊహించుకొని సృష్టించానని తెలిపారు.

ఈ కష్టకాలం తర్వాత, అనిల్ రావిపూడి, కో-డైరెక్టర్ సత్తిబాబు (సత్యం బాబు) దయతో ఒక పాత్ర లభించడంతో శ్రీనివాస్ కెరీర్‌లో మలుపు వచ్చింది. మూడు సంవత్సరాల పాటు సత్తిబాబు వెంటపడగా, ఆయన రాజేష్‌కు చెప్పి శ్రీనివాస్‌ను పిలిపించారు. ఈ అవకాశం తనకు ఇప్పుడు పెద్దగా అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసిందని, ఎన్నో సినిమా ఓపెనింగ్‌లకు హాజరవుతున్నానని, తన సహచర నటీనటులు, డిపార్ట్‌మెంట్ సభ్యులు తమంతట తామే అవకాశాలు ఇస్తున్నారని శ్రీనివాస్ సంతోషంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us