Prakash Raj: చండి హోమం, గుడిలో పూజలు చెయ్యడానికి రీజన్ చెప్పిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..

ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలంతో గుర్తింపు పొందారు. హోమ హవనంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. తన భార్య పట్ల గౌరవంతోనే హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 'నేను హోమ-హవనాల్లో కూర్చోవడం ఇష్టాయిష్టాల ప్రస్తక్తి వేరే విషయం.. అయితే నేను తన భార్య విశ్వాసాన్ని నమ్మకాన్ని గౌరవించి చండీ హోమంలో కూర్చుని పూజ చేశానని.. నేను భార్యను గౌరవిస్తాను' అని స్పష్టం చేశాడు

Prakash Raj: చండి హోమం, గుడిలో పూజలు చెయ్యడానికి రీజన్ చెప్పిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..
Prakash Raj
Follow us

|

Updated on: Aug 08, 2023 | 2:17 PM

బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడుగా ఖ్యాతిగాంచాడు. తన నటనతో పాటు ప్రకాష్ రాజ్ తన సిద్ధాంతాల మీద మాట్లాడుతూ తరచుగా వార్తల్లో నిలుస్తాడు. ఇటీవల కుటుంబ సమేతంగా కొల్లూరు వెళ్లి చండికా హోమంలో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ ను చేసిన పనిని పలువురు విమర్శించారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ తొలిసారిగా మౌనం వీడారు. షిమోగాలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడాడు.

చండికా హోమంలో పాల్గొనడానికి కారణం ఏమిటంటే..

ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలంతో గుర్తింపు పొందారు. హోమ హవనంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. తన భార్య పట్ల గౌరవంతోనే హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ‘నేను హోమ-హవనాల్లో కూర్చోవడం ఇష్టాయిష్టాల ప్రస్తక్తి వేరే విషయం.. అయితే నేను తన భార్య విశ్వాసాన్ని నమ్మకాన్ని గౌరవించి చండీ హోమంలో కూర్చుని పూజ చేశానని.. నేను భార్యను గౌరవిస్తాను’ అని స్పష్టం చేశాడు.

నాటక రంగానికి ప్రోత్సాహం

ప్రకాష్ రాజ్ కు కళలంటే ప్రత్యేక అభిమానం. కనుక ఎప్పుడూ థియేటర్‌ ఆర్ట్స్ ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యంగా పిల్లలకు రంగస్థలంలో నటన నేర్పేందుకు ముందుకు వచ్చాం. ప్రపంచంలోని వివిధ కవులు, రచయితల రచనలను పరిచయం చేస్తూ ఒక నాటకం చేయబోతున్నాం. ప్రేక్షకులకు, నటుడికి మధ్య బంధాన్ని ఏర్పరచాలనుకున్నాం. మనిషిలో ప్రేమ ఉంది, దాన్ని పంచుకుని జీవించాలి’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు.. తాజాగా ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ, సిద్ధరామయ్య ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలను విమర్శించారు.. ఇది కరెక్ట్ కాదంటూ ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘హామీ పథకాలు ప్రజాదరణ పొందాయి. ఇవి ప్రజలకు మంచిది. ఈ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించారు. దేశంలో అతని ప్రణాళికలు విఫలమయ్యాయి అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..