Krishnam Raju: రెబల్ స్టార్ నలుగురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా ?.. వారి పెళ్లి చూడకుండానే…

| Edited By: Ravi Kiran

Sep 12, 2022 | 5:46 PM

అలాగే..విశాలనేత్రాలు, జీవన తరంగాలు నవల ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి చేయాలని.. వారి పిల్లలతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడ్డారు. ఇవేవి నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు.

Krishnam Raju: రెబల్ స్టార్ నలుగురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా ?.. వారి పెళ్లి చూడకుండానే...
Krishnam Raju Family
Follow us on

సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చివరగా.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్‏ ఈవెంట్‍లోనూ ఉత్సాహంగా పాల్గోన్నారు కృష్ణంరాజు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సమాజ సేవలోనూ ముందున్నారు. రాజకీయ ప్రస్థానంలో తనదైన ముద్రవేశారు. కృష్ణంరాజు మృతిని ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన కుటుంబానికి సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం సానుభూతి తెలుపుతున్నారు. అయితే కృష్ణంరాజుకు కొన్ని కోరికలు ఉండేవి. భక్తకన్నప్ప చిత్రానికి ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారు. అలాగే..విశాలనేత్రాలు, జీవన తరంగాలు నవల ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి చేయాలని.. వారి పిల్లలతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడ్డారు. ఇవేవి నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు.

ఇక సోమవారం సాయంత్రం మొయినాబాద్ లోని కనమామిడి ఫామ్ హౌస్‏లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణం రాజుకు ముగ్గురు కూతుళ్లు. వీళ్ల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద లండన్‏లో ఏంబీఏ పూర్తిచేసింది. అంతేకాకుండా ప్రభాస్.. కృష్ణంరాజు కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే.. ఆయన రెండో కుమార్తె ప్రకీర్తి హైదరాబాద్‏లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతుంది. ఇక మూడో అమ్మాయిలో ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా సమాచారం. అలాగే కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి కూతురు కూడా కృష్ణంరాజుతోనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.