బాలీవుడ్​లో విషాదం..ప్ర‌ముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత

బాలీవుడ్​లో ప్ర‌ఖ్యాత యాక్ష‌న్ డైరెక్ట‌ర్ పర్వీజ్​ఖాన్ క‌న్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం 'షాహిద్ తో పాటు 'అంధాధున్', 'బద్లాపూర్', 'జానీ గద్దర్', 'ఏజెంట్ వినోద్' వంటి హిట్ చిత్రాల‌కు ఈయ‌న ప‌నిచేశారు.

బాలీవుడ్​లో విషాదం..ప్ర‌ముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత
Follow us

|

Updated on: Jul 28, 2020 | 9:06 AM

Action director Parvez Khan dies : బాలీవుడ్​లో ప్ర‌ఖ్యాత యాక్ష‌న్ డైరెక్ట‌ర్ పర్వీజ్​ఖాన్ క‌న్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘షాహిద్ తో పాటు ‘అంధాధున్’, ‘బద్లాపూర్’, ‘జానీ గద్దర్’, ‘ఏజెంట్ వినోద్’ వంటి హిట్ చిత్రాల‌కు ఈయ‌న ప‌నిచేశారు. కాగా ప‌ర్వీజ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్​గోపాల్ వర్మ నిర్మించిన ‘అబ్ తక్ ఛప్పన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న‌ పర్వేజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. 55 ఏళ్ల ఈ యాక్షన్ డైరెక్టర్ జూలై 27 న ఛాతీ నొప్పితో రావ‌డంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ప‌రిస్థితి విషమించి క‌న్నుమూశారు.

“ఎంతో టాలెంట్ ఉన్న‌ వ్యక్తి పర్వీజ్. ‘షాహిద్’లోని ఓ కీలక యాక్షన్ సీన్ ను సింగిల్ టేక్​లో కంప్లీట్ చేశారు . ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా” అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా ఖాన్ మృతికి సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు