
గామా తెలుగు మూవీ అవార్డ్స్ నాలుగవ ఎడిషన్ మార్చి 3న దుబాయ్లోని జబిల్ పార్క్లో జరిగింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి, గేయరచయిత చంద్రబోస్లకు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’అవార్డును అందజేశారు.

గామా అవార్డ్స్ ఈవెంట్కు చీఫ్ గెస్టులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు మనో, ధనుంజయ్ పాల్గొన్నారు.

గామా అవార్డ్స్ ఈవెంట్కు చీఫ్ గెస్టులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు మనో, ధనుంజయ్ పాల్గొన్నారు.

వందలాది తెలుగు, తమిళ, మళయాళ సినీ ప్రేమికుల మధ్యలో ఈ అవార్డ్స్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ పలువురు హీరోలు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే షూటింగ్ కారణంగా హాజరుకాలేకపోయారు. గామా అవార్డ్స్ ఈవెంట్కు డింపుల్ హయతి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది.

2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలకు అవార్డులను అందజేశారు. బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్ వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేశారు.