ప్రభాస్ ‘ఆదిపురుష్’ అలా సెట్ అయ్యిందట!
కరోనా లాక్డౌన్ వేళ తన తదుపరి రెండు చిత్రాలను ప్రకటించి, ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఇచ్చారు రెబల్స్టార్ ప్రభాస్
Prabhas Adipurush movie: కరోనా లాక్డౌన్ వేళ తన తదుపరి రెండు చిత్రాలను ప్రకటించి, ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఇచ్చారు రెబల్స్టార్ ప్రభాస్. అందులో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కాగా, మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ ఒకటి. నాగ్ అశ్విన్- ప్రభాస్ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో.. ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్నాయి. బాహుబలి తరువాత తన క్రేజ్ను మరింత పెంచుకునేందుకు ఇలా డిఫరెంట్ చిత్రాలకు ఓకే చెప్పారు ప్రభాస్. అయితే ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందన్న విషయంపై ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే టీ సిరీస్లో నిర్మాణంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను చేయాల్సి ఉందట. అయితే సందీప్ చెప్పిన కథ, రెబల్ స్టార్కి పెద్దగా నచ్చలేదట. ఈ క్రమంలో టీసిరీస్, ఓమ్ రౌత్ని లైన్లో తెచ్చిందట. ఇక ఓమ్ రౌత్ చెప్పిన కథ ప్రభాస్కి నచ్చేయడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారట. ఇలా ఆదిపురుష్ సెట్ అయినట్లు తెలుస్తోంది. కాగా 3డీలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని టీ సిరీస్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు ఓమ్ రౌత్ వెల్లడించారు.
Read More: