
బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే.. గతవారమే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా వచ్చారు. ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతున్న బిగ్ బాస్ షోకు ఇప్పుడు షాక్ తగిలింది. ప్రముఖ ఛానెల్ మా టీవీ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొందరు. గజ్వేల్ కు చెందిన కమ్మరి. శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ బిగ్ బాస్ షో పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది అంటూ బిగ్ బాస్ షో గురించి ఆరోపించారు ఆ యువకులు.
కాగా గజ్వేల్ కు చెందిన పలువురు యువకులు.. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ షో పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో.. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవపట్టిస్తుందని.. బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుంటున్న బిగ్ బాస్ టీం.. సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు.. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
“బిగ్ బాస్ షో పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాము. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలి. నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యాలి. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది” అని పలువురు యువకులు ప్రశ్నిస్తున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇప్పటికే 39 రోజులు అవుతుంది. కొందరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి