Keerthy Bhat: వస్తావా అని అడిగితే తెలియక సరే అన్నాను.. చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..

కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. తీవ్రగాయాలైన కీర్తి చాలాకాలం పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. మంగుళూరు నుంచి బెంగుళూరు చేరుకుని అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది.

Keerthy Bhat: వస్తావా అని అడిగితే తెలియక సరే అన్నాను.. చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
Keerthy Bhat
Follow us

|

Updated on: Apr 27, 2024 | 12:37 PM

బుల్లితెర ప్రేక్షకులకు కీర్తి భట్ సుపరిచితమే. 2019లో మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో భానుగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో కనిపించి మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. తనదైన ఆట తీరుతో టాప్ 5 వరకు నిలిచింది. కీర్తి ప్రస్తుతం మధురానగరిలో సీరియల్లో నటిస్తుంది. ఇప్పుడు అడియన్స్ అందరికి తెలిసిన కీర్తి జీవితంలో ఎన్నో కష్టాలు.. చేదు రోజులు ఉన్నాయి. సీరియల్స్ లోకి రాకముందే ఆమె జీవితంలో పెను విషాదం నెలకొంది. కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. తీవ్రగాయాలైన కీర్తి చాలాకాలం పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. మంగుళూరు నుంచి బెంగుళూరు చేరుకుని అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది.

సీరియల్స్, బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు కాబోయే భర్తతో కలిసి యూట్యూబ్ వీడియోస్, ఇన్ స్టాలో రీల్స్ చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. “ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగుళూరుకు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస్తుంది. కానీ స్పర్శలేకపోవడం వల్ల నెట్టేయడానికి బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే 200 ఇస్తా వస్తావా అంటే సరే వస్తానని అనేదాన్ని. ఆ తర్వాత వాళ్ల లుక్స్ చూసి అర్థమయ్యేది” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.

కీర్తికి కన్నడ పరిశ్రమకు చెందిన విజయ్ కార్తీక్ తో నిశ్చితార్థం జరిగింది. ఏపీకి చెందిన కార్తీక్ కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. సెడు, డీడీ, కన్నడక్కగి ఓన్దన్ను ఒట్టి సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు. 2014లో కన్నడలో మెలోడీ అనే సినిమాతో హీరోకి స్నేహితుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సేడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.