మరోసారి ట్రెండ్ అవుతున్న మహేష్ ‘సర్కారు వారి పాట’.. 100 మిలియన్ మార్క్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు..

మరోసారి ట్రెండ్ అవుతున్న మహేష్ 'సర్కారు వారి పాట'.. 100 మిలియన్ మార్క్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఫ్యాన్స్..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 5:40 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో  ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపధ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది ఇందుకోసం చిత్రయూనిట్ ఇప్పటికే దుబాయ్ కి చేరుకుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయినా మహేష్ సర్కారు వారి పాట ట్రెండ్ అవుతుంది. గతంలోనూ కొత్తసంవత్సరం సందర్భంగా ఎలాంటి అప్డేట్ లేకుండానే మహేష్ బాబు సర్కారు వారి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతానికి ‘సర్కారు వారి పాట’ పేరిట 90 మిలియన్స్ పైగా హ్యాష్ ట్యాగ్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్.. 100 మిలియన్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి సినిమాగా నిలపడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే మహేష్ సినిమాకోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allari Naresh : ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డా..’నాంది’మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నరేష్