Tollywood: ఈ టాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా? అసలెందుకిలా మారిపోయింది.. ఫొటోస్ వైరల్

|

Oct 05, 2024 | 4:29 PM

పై ఫొటోలో బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్‌లో బాగా ఫేమస్. తన చలాకీ మాటలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందింది. మరీ ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో ఆమె చేసిన టీవీ షోస్, ప్రోగ్రామ్స్ బుల్లితెర ఆడియెన్స్ ను తెగ మెప్పించాయి. అన్నట్లు బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార.

Tollywood: ఈ టాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా? అసలెందుకిలా మారిపోయింది.. ఫొటోస్ వైరల్
Tollywood Anchor
Follow us on

పై ఫొటోలో బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్‌లో బాగా ఫేమస్. తన చలాకీ మాటలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందింది. మరీ ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో ఆమె చేసిన టీవీ షోస్, ప్రోగ్రామ్స్ బుల్లితెర ఆడియెన్స్ ను తెగ మెప్పించాయి. అన్నట్లు బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార.
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి హౌస్ లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదీ అందాల యాంకరమ్మ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తోంది. తన పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటోంది. అలా తాజాగా ఈ యాంకరమ్మ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఆమె బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తూ కనిపించింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ స్టార్ యాంకరమ్మకు ఏమైంది అని కామెంట్స్ పెట్టారు. అయితే ఆ తర్వాత విషయం తెలుసుకుని కూల్ అయ్యారు. మరీ ఈ యాంకరమ్మ ఎవరో గుర్తు పట్టారా? యస్. ఆమె మరెవరో కాదు ఏనుగు, చీమ జోకులతో ఆడియెన్స్ ను నవ్వించిన లాస్య. ఇక ఈ ఫొటోలు, వాటి వెనక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.

 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగ జరుగుతున్నాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి రూపానికి తగినట్లుగా తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భక్తులు దుర్గామాతను పూజిస్తారు. ఈ క్రమంలోనే యాంకర్ లాస్య కూడా తన దైన విధానంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకొంది. ఒక్కో రోజూ ఒక్కో కలర్ దుస్తులు ధరిస్తూ వాటి వెనక ఉన్న ప్రాశస్త్యాన్ని నెటిజన్లతో పంచుకుంది.

 

నవరాత్రుల్లో భాగంగా మొదటిరోజు పసుపు రంగు చీరలు ధరించింది. ఇది శైలపుత్రి రూపం అంటూ పసుపు రంగు ప్రాధాన్యతను పంచుకుంది. ఇక రెండో రోజూ ‘బ్రహ్మచారిణి దేవి’ రూపం అంటూ ఆకుపచ్చరంగు దుస్తులు ధరించింది.

ఇక మూడోరోజున చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారట. అందులో భాగంగానే బూడిద రంగు దుస్తులు ధరించింది లాస్య. ఇది మహిళా శక్తికి ప్రతిరూపమని క్యాప్షన్ లో చెప్పుకొచ్చింది. ఇలా మిగిలిన ఆరు రోజులకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో లాస్య పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.