AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: ప్రియుడితో కలిసి దుబాయ్‏లో కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసిన బిగ్‏బాస్ బ్యూటీ..

బిగ్‏బాస్ ఇంట్లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు

Bigg Boss: ప్రియుడితో కలిసి దుబాయ్‏లో కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసిన బిగ్‏బాస్ బ్యూటీ..
Tejaswi
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2022 | 10:01 AM

Share

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం.. కన్నడలో అనేక మంది ఈ షో ద్వారా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా హిందీలో ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే 15 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో… ఇప్పుడు 16 సీజన్ కొనసాగుతుంది. అయితే బిగ్‏బాస్ సీజన్ 15 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. ఇందులో తేజస్వి ప్రకాష్.. కరణ్ కుంద్రా చేసిన అల్లరి ప్రేక్షకులను కట్టిపడేసింది.

బిగ్‏బాస్ ఇంట్లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అనేకసార్లు వీరిద్దరు కలిసి మీడియాకు చిక్కారు. అంతేకాకుండా తేజస్వీ నటిస్తోన్న నాగిన్ సీరియల్ సెట్ లోకి కరణ్ తరచూ వచ్చేవాడని టాక్. ముంబై వీదుల్లో వీరు కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోస్ వీడియోస్ నెట్టింట వైరల్ కావడంతో వీరి ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత చేకూరింది.

ఇవి కూడా చదవండి

కరణ్ కుంద్రా, తేజస్వి దుబాయ్‌లో విలాసవంతమైన 1 BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈ ఫ్లాట్‌లో ఇండోర్ పూల్ కూడా ఉందట. ఈ ఫ్లాట్ ధర దాదాపు 2 కోట్లు అని టాక్. తేజస్వి ప్రస్తుతం నాగిన్ సిరీస్‌తో పాటు మరాఠీ చిత్రంలో చేస్తోంది. ఇటీవలే ఆమె గోవాలో తన సొంత ఇంటిని కొనుగోలు చేసింది. మరోవైపు కరణ్ కుంద్రా ముంబైలో విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.\

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.