సోషల్ మీడియా హీరోగా సోనూ.. అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా గుర్తింపు..
కరోనా కాలంలో కష్టం వచ్చిందంటే చాలు మొదటగా గుర్తుకువచ్చే వ్యక్తి సోనూసూద్. లాక్డౌన్ సమయంలో ఎంతోమందికి చేయూతనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు. వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇలా ఎంతో మందికి సాయం చేశారు.
కరోనా కాలంలో కష్టం వచ్చిందంటే చాలు మొదటగా గుర్తుకువచ్చే వ్యక్తి సోనూసూద్. లాక్డౌన్ సమయంలో ఎంతోమందికి చేయూతనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు. వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇలా ఎంతో మందికి సాయం చేశారు. అందుకే ఆయనను చాలామంది అభిమానిస్తున్నారు. దైవంగా ఆరాధిస్తున్నారు. సోనూ రీల్ హీరో కాదని రియల్ హీరో అని కొనియాడుతున్నారు.
ఆయన ప్రస్తుతం మరో ఘనతను సాధించారు. సోషల్ మీడియా అనలిటిక్స్ ప్రకారం ఇండియాలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన వ్యక్తుల్లో నాలుగో స్థానం సంపాధించారు. అంతేకాకుండా బాలీవుడ్ ఖాన్ ద్వయాన్ని సైతం వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచారు. పాలిటిక్స్, సినిమా, బిజినెస్, స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కలిపి అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా సోనూసూద్ నిలిచారు. అగ్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉండగా, రెండో స్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, 2.4 మిలియన్ సెర్చ్తో సోనూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు ట్టిట్టర్లో 4.7 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్లో 7.8 మిలియన్లు, ఫేస్బుక్లో 3.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా సోనూను అనుసరిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ సోనూసూద్ను ఐకాన్గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే..