‘ఓ బేబి’ సినిమా సక్సెస్ కోసం..
తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేకంటేశ్వర స్వామిని సినీ నటి, అక్కినేని కోడలు సమంత, ఆమె సన్నిహితురాలు రమ్య సుబ్రమణ్యన్, దర్శకురాలు నందినీ రెడ్డి, అభిరామ్ దగ్గుపాటి తదితరులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం సమంత మాట్లాడుతూ ఓ బేబి చిత్రం హిట్ కావాలని స్వామి వారిని మొక్కుకున్నానని.. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నానని వెల్లడించారు. కాగా సమంత ప్రధానపాత్రలో నందినీ రెడ్డి ‘ఓ బేబి’ని తెరకెక్కించారు. కొరియాలో […]
తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేకంటేశ్వర స్వామిని సినీ నటి, అక్కినేని కోడలు సమంత, ఆమె సన్నిహితురాలు రమ్య సుబ్రమణ్యన్, దర్శకురాలు నందినీ రెడ్డి, అభిరామ్ దగ్గుపాటి తదితరులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం సమంత మాట్లాడుతూ ఓ బేబి చిత్రం హిట్ కావాలని స్వామి వారిని మొక్కుకున్నానని.. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నానని వెల్లడించారు.
కాగా సమంత ప్రధానపాత్రలో నందినీ రెడ్డి ‘ఓ బేబి’ని తెరకెక్కించారు. కొరియాలో విజయం సాధించిన ‘మిస్ గ్రానీ’ రీమేక్గా ఇది తెరకెక్కింది. ఇందులో రాజేంద్రప్రసాద్, అడివి శేషు, నాగశౌర్య, శ్రీలక్ష్మి, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూలై 5న ఓ బేబి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
#OhBaby @Samanthaprabhu2 paid a visit to #Tirumala along with her good friend @ramyavj @SureshProdns @mahendra7997 #OhBabyOnJuly5 #Samantha pic.twitter.com/aEPNaOYlGz
— Venkatesh V (@venkatesh_et) July 2, 2019