‘భారత్’ కోసం..వచ్చాడండీ సల్లూభాయ్
ముంబయి: కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కొత్త చిత్రం ‘భారత్’ ట్రైలర్ విడుదలైంది. సల్మాన్ను ఐదు విభిన్నమైన గెటప్స్లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రంలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ సెటిమెంట్, లవ్ అన్నీ కలగలిసి ఉన్నట్టు తెలుస్తోంది. కత్రినా కైఫ్, దిశా పటానీ హీరోయిన్స్గా నటించారు. భారత్ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రంజాన్ సందర్భంగా […]

ముంబయి: కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కొత్త చిత్రం ‘భారత్’ ట్రైలర్ విడుదలైంది. సల్మాన్ను ఐదు విభిన్నమైన గెటప్స్లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రంలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ సెటిమెంట్, లవ్ అన్నీ కలగలిసి ఉన్నట్టు తెలుస్తోంది. కత్రినా కైఫ్, దిశా పటానీ హీరోయిన్స్గా నటించారు. భారత్ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది? అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రంజాన్ సందర్భంగా జూన్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




