AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొరియోగ్రాఫర్‌గా మారనున్న సాయి పల్లవి.. ఎవరి కోసమంటే..!

సాయి పల్లవి అనగానే.. ఆమె సహజ నటన మాత్రమే కాదు డ్యాన్స్ కూడా అందరికి గుర్తొస్తుంది. మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ నటి..

కొరియోగ్రాఫర్‌గా మారనున్న సాయి పల్లవి.. ఎవరి కోసమంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 8:16 AM

Share

సాయి పల్లవి అనగానే.. ఆమె సహజ నటన మాత్రమే కాదు డ్యాన్స్ కూడా అందరికి గుర్తొస్తుంది. మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ నటి.. ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. అది తన సినిమాలోనే పాట కోసమేనని సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఆమెను అడగటం, అందుకు ఫిదా బ్యూటీ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న లవ్‌ స్టోరీలో సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి మరో రెండు వారాల షూటింగ్‌ పెండింగ్‌లో ఉందట. ఇందులో ఓ పాట కూడా ఉందట. ఈ మొత్తాన్ని త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్న దర్శకుడు అందుకు సంబంధించిన పనులను ప్రారంభించేశారట. ఈ క్రమంలో ఈ మూవీలో మిగిలి ఉన్న ఒక్క పాటకు కొరియోగ్రఫీ చేయమని శేఖర్ కమ్ముల, సాయి పల్లవిని అడిగారట. అందుకు మలార్ బ్యూటీ హ్యాపీగా ఒప్పేసుకుందట. ఈ క్రమంలో ఈ పాటకు కంపోజ్ చేయడంతో పాటు అందులో సాయి పల్లవి కనిపించనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.