Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే.!

|

Sep 11, 2021 | 7:33 PM

Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే.!
Sai Dharam Tej
Follow us on

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. అంతర్గత గాయాలు ఏమి లేవని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని అపోలో వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అటు ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటిది ఏమిలేదన్న వైద్యులు.. చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ పర్యవేక్షణలో సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స నిర్వహిస్తున్నామన్నారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్ సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు అన్నారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు.

Also Read: