Pushpa Movie Update: విదేశాలకు వెళ్ళనున్న ‘పుష్ప’.. అక్కడే అసలు ట్విస్టు మొదలవుతుందంటా ?

|

Jan 25, 2021 | 1:16 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్

Pushpa Movie Update: విదేశాలకు వెళ్ళనున్న పుష్ప.. అక్కడే అసలు ట్విస్టు మొదలవుతుందంటా ?
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‏గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ టీం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మసిస్తున్నారు. ఇక ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు భావిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‏డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతుండగా.. అనంతరం పారిన్‏ వెళ్ళనున్నారట చిత్రయూనిట్. ఫారిన్ ఎందుకు వెళ్ళనున్నారంటే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. ఇక అక్కడి ట్విస్టుతోనే ఇక్కడి అడవుల్లో అసలు కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పాత్రలో మరో కోణం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల వైకుంఠపురం తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో భారీ హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘A’ మూవీ.. డిఫరెంట్ థ్రిల్లర్‏గా.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే ?