సెన్సార్ పూర్తిచేసుకున్న ‘A’ మూవీ.. డిఫరెంట్ థ్రిల్లర్‏గా.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే ?

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'A'. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్నాల ఈ చిత్రాన్ని

సెన్సార్ పూర్తిచేసుకున్న 'A' మూవీ.. డిఫరెంట్ థ్రిల్లర్‏గా.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే ?
Follow us

|

Updated on: Jan 25, 2021 | 11:06 AM

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘A’. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్నాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‏కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలనే ఏ మూవీ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్‏లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటికంటే A మూవీ మొత్తం విభిన్న కథాంశంతో రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు చిత్ర దర్శకుడు యగంధర్ మున్నా.

Also Read:

Actress Payal Rajput: మరో స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్న పాయల్ ? ఆ ఇద్దరు హీరోల సరసన నటించనున్న బ్యూటీ..