AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 35 లక్షలు పెట్టి తీస్తే.. ఆ సినిమా రోడ్డు మీద పడేసింది.. కానీ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్.. నిర్మాత కామెంట్స్..

ఆ సినిమా తన కెరీర్‌లో ఆర్థికంగా పెద్ద నష్టాన్ని మిగిల్చిందని నిర్మాత స్రవంతి రవికిషోర్ వెల్లడించారు. రూ. 35 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఈ ఒడిదుడుకుల నుండి తేరుకొని, ఆయన తమిళ చిత్రాల డబ్బింగ్, బ్యానర్ పేరు మార్పు వంటి సాహసోపేత నిర్ణయాలతో ఎలా విజయవంతమయ్యారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tollywood : 35 లక్షలు పెట్టి తీస్తే.. ఆ సినిమా రోడ్డు మీద పడేసింది.. కానీ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్.. నిర్మాత కామెంట్స్..
Maharshi Movie
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2026 | 2:00 PM

Share

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు నిలబడిన నిర్మాత స్రవంతి రవికిషోర్, తన కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, సాహసోపేత నిర్ణయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా 1987లో తాను నిర్మించిన మహర్షి సినిమాతో ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రం తనకు తెలిసి ప్రాణం పెట్టి చేసిన సినిమా అని రవికిషోర్ పేర్కొన్నారు. ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందాయని, ఆ పాటలు వినని ఇల్లు ఉండదని ఆయన అన్నారు. ప్రారంభంలో రూ. 17-18 లక్షల బడ్జెట్‌తో అనుకున్న ఈ సినిమా చివరకు రూ. 35 లక్షలు ఖర్చుతో పూర్తయిందని, ఇది ఆ కాలంలో భారీ మొత్తమని రవికిషోర్ గుర్తుచేసుకున్నారు. మహర్షి సినిమా కథాంశం, అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదని, ఇది “చాలా అడ్వాన్స్‌డ్‌గా” ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు. పెళ్లయిన అమ్మాయి వెనకాల ప్రేమించినవాడు తిరగడం అనే కాన్సెప్ట్ 1987లో సమాజం ఇంకా అంగీకరించే స్థితిలో లేదని, అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదని రవికిషోర్ స్పష్టం చేశారు. ఈ చిత్రం వల్ల దాదాపు రూ. 25 లక్షల రూపాయలు కోల్పోయి, కేవలం రూ. 9 లక్షల రికవరీ మాత్రమే వచ్చిందని, ఈ నష్టం తనను “లిటరల్‌గా రోడ్ల మీద పడేసినంత” చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాంగ్ కాస్టింగ్ కూడా ఒక కారణం కావచ్చు కానీ, ప్రధాన కారణం “టూ అడ్వాన్స్‌డ్” కథే అని ఆయన అభిప్రాయపడ్డారు.

మహర్షి వైఫల్యం తరువాత కూడా రవికిషోర్ పట్టువదలలేదు. “జాయింట్ వీల్” లాంటి తన సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, “మొండి ధైర్యం”తో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లేడీస్ టైలర్ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఆయన తమిళ చిత్రాలను తెలుగులో విడుదల చేసే ప్రయత్నాలు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకన్ (నాయకుడు), పుష్పక విమానం వంటి చిత్రాల తెలుగు హక్కులు కొనుగోలు చేసి, ఇక్కడ విడుదల చేశారు.

నాయకన్ సినిమా డబ్బింగ్ విషయంలో రవికిషోర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటి వరకు రాజశ్రీ డబ్బింగ్ పాటలు రాసేవారని, అవి కొన్నిసార్లు తమిళ ఛాయలు కలిగి ఉండేవని ఆయన పేర్కొన్నారు. మహర్షిలో మాటరాని మౌనం పాటతో తన దృష్టిని ఆకర్షించిన వెన్నెలకంటిని నాయకన్ పాటలు రాయడానికి అవకాశం ఇచ్చారు. దీనితో వెన్నెలకంటి డబ్బింగ్ రచయితగా స్థిరపడ్డారని, నాయకన్ ఒక డబ్బింగ్ సినిమా అని ప్రేక్షకులు గుర్తించనంత సహజంగా వచ్చిందని రవికిషోర్ వివరించారు. పుష్పక విమానం అయితే భాషతో సంబంధం లేని ఒక ప్రయోగమని ఆయన అన్నారు. తన కెరీర్ మొత్తంలో వంశీతో ప్రారంభించి, ఆ తర్వాత ఎస్.వి. కృష్ణారెడ్డితో సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఎస్.వి. కృష్ణారెడ్డి రాజేంద్ర గజేంద్ర సినిమా తీసిన తర్వాత, ఆయన ప్రతిభను గుర్తించి, మామిడి చిగురు, ఎగిరే పావురమా, మనసులో మాట వంటి వరుస చిత్రాలు నిర్మించారు.

Follow Us