భారతీయ పౌరసత్వ నిర్ధారణకు పాస్పోర్ట్ సరిపోదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎన్ఆర్సీ ప్రక్రియ నేపథ్యంలో పౌరసత్వ గుర్తింపుపై చర్చ జరుగుతోంది. అక్రమ పత్రాల వినియోగంపై ఆందోళనల మధ్య, ప్రపంచంలోని 100 దేశాల్లో పౌరసత్వ కార్డులు అమల్లో ఉన్నాయని, భారత్ కూడా అలాంటి గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.