AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది.

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 23, 2020 | 9:55 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. ఈ విషయంపై అటు ప్రశాంత్, ఇటు మైత్రీ సంస్థ క్లూలు ఇచ్చేశారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌కి డేట్లు ఇవ్వగా..ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన తరువాతే ప్రశాంత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మైత్రీ అధినేతల్లో ఒకరైన నవీన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

కేజీఎఫ్‌ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపారని, అతడిని అడగమని తమకు ఎన్టీఆర్‌నే సూచించారని నవీన్ అన్నారు. దాంతో ప్రశాంత్‌తో తాము సంప్రదింపులు చేశామని, ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఆయన కూడా సంతోషంగా అంగీకరించారని వెల్లడించారు. అయితే ఈ కాంబోలో సినిమాకు ఇంకా కథా చర్చలు జరగలేదని, ప్రశాంత్ ఇంకా ఎన్టీఆర్‌కి కథ చెప్పాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో ప్రశాంత్ సినిమా చేయడంపై కన్నడ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో గెటౌట్ ప్రశాంత్ నీల్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనపై ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. తాను చేసే ప్రతి ప్రాజెక్ట్‌ కన్నడ చిత్రమే అయి ఉంటుందని అన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ డౌట్ అంటూ రూమర్లు వచ్చాయి. కానీ తాజాగా నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో.. నిదానంగా అయినా ఈ క్రేజీ కాంబోలో మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.

Read This Story Also: రాజ్యసభ సభ్యుడు అరెస్ట్..కొన్ని గంటల్లోనే.. !