Sathi Gani rendu Ekaralu: ఆహాలో రాబోతున్న ‘సత్తిగాని రెండు ఎకరాలు’.. ఆకట్టుకుంటున్న టీజర్..

|

Mar 07, 2023 | 12:55 PM

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి జగదీశ్ కథానాయికుడిగా కనిపించారు. అలాగే ఇందులో వెన్నెల కిశోర్, మోహన శ్రీ కీలకపాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.

Sathi Gani rendu Ekaralu: ఆహాలో రాబోతున్న సత్తిగాని రెండు ఎకరాలు.. ఆకట్టుకుంటున్న టీజర్..
Sathi Gani Rendu Ekuralu
Follow us on

పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఇప్పుడు చిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించగా.. ఇటీవల ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ బ్యానర్ పై వస్తోన్న చిన్న సినిమా సత్తి గాని రెండు ఎకరాలు. ఈ సినిమాతో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగుపెడుతుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి జగదీశ్ కథానాయికుడిగా కనిపించారు. అలాగే ఇందులో వెన్నెల కిశోర్, మోహన శ్రీ కీలకపాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.

ఈ మూవీ మార్చి 17 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్బంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమవుతుంది. ఇందులో హీరో ఒక సమస్య నుంచి బయటపడేందుకు కొంత డబ్బు అవసరమవుతాయి. అందుకోసం తనకున్న ఆటో అమ్మేయగా రూ. 25 లక్షలు వస్తాయి. ఆ డబ్బు కూడా సరిపడక.. తనకున్న రెండు ఎకరాలను అమ్మడానికి ప్రయత్నిస్తాడు. ఆ దారిలో తనకు ఎదురైన సంఘటనలే సత్తిగాని రెండు ఎకరాలు. కామెడీ ఎంటర్టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.