Veera Simha Reddy: ఓటీటీలోకి వచ్చేసిన వీరసింహారెడ్డి.. అప్పుడే రికార్డుల వేట మొదలు.. బాలయ్య సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

|

Feb 24, 2023 | 6:00 AM

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది

Veera Simha Reddy: ఓటీటీలోకి వచ్చేసిన వీరసింహారెడ్డి.. అప్పుడే రికార్డుల వేట మొదలు.. బాలయ్య సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Veera Simha Reddy
Follow us on

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. గురువారం సాయంత్రం 6.30 గంటలకే ఓటీటీలోకి అడుగుపెట్టిన వీరసింహారెడ్డి అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు. విడుదలైన నిమిషంలో ఒక లక్షా యాభై వేల (150K) యూనిక్ వ్యూవర్స్‌ని సొంతం చేసుకుని రికార్డ్‌‌ను క్రియేట్ చేసింది బాలయ్య సినిమా. ఈ విషయాన్నిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. హనీరోజ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నెగెటివ్‌ రోల్‌లో మెప్పించింది. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ మెయిన్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక థమన్‌ అందించిన పాటలు, బీజీఎమ్‌ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..