
గతవారం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు 8.6/10 రేటింగ్ దక్కడం విశేషం. 1500 ఏళ్ల కిందటి రాజవంశానికి చెందిన నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. కదంబరాజుల కాలానికీ .. 1990ల నాటి కాలానికి మధ్యలో నడిచే ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. క థ విషయానికొస్తే, దట్టమైన అడవీ ప్రాంతాన్ని ఆనుకుని మారిగల్లు అనే ఓ కుగ్రామం ఉంటుంది. అక్కడి ప్రజలు మారి అనే దేవత పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. అదే గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే మాస్టర్, ప్రాచీన శిలాఫలకాలను రహస్యంగా సేకరిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అప్పు కోసం వచ్చిన ‘వరద’ కంట ఆ ప్రాచీన శాసనాలు పడతాయి. అందులోకి ఒక శాసనాన్ని అతను తీసుకుని వెళ్లి, పురావస్తు శాఖకి చెందిన అధికారి ముందు ఉంచుతాడు. అది కదంబరాజుల కాలంలో దాచబడిన నిధి తాలూకు శాసనమని అతనికి అర్థమవుతుంది. మరి ఆ అధికారి ఏం చేస్తాడు? తర్వాత ఏం జరిగింది? నిధి కోసం ఎవరెవరు ఏయే ప్రయత్నాలు చేశారు? చివరికి నిధి దొరికిందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ కన్నడ వెబ్ సిరీస్ పేరు మారిగల్లు. దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. దేవరాజ్ పూజారి తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఏఐ సహాయంతో పునీత్ ను మళ్లీ చూపించగలిగారు. దీంతో ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి తోడు ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
This is apparently all that Zee5 could use from my review of #Maarigallu 🤦♀️ pic.twitter.com/PFO2pRjymk
— Prathibha Joy (@pratshere) November 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.