ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. ‘విరాటపర్వం’ విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

|

May 25, 2021 | 2:25 PM

Virata Parvam Movie Update: రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. ఇందులో రానా సరసన

ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. విరాటపర్వం విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Virata Parvam
Follow us on

Virata Parvam Movie Update: రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. ఇందులో రానా సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి.  ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ఏప్రిల్ 30న రిలీజ్‌ కావాల్సి ఉంది.. కానీ అదే సమయంలో కరోనా అడ్డంపడింది. దీంతో తాత్కలికంగా సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా వేసినప్పటి నుంచి ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. Rana Daggubati

తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ వేణు ఊడుగుల స్పందించారు. విరాట పర్వం సినిమా ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని.. కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత.. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణాంగా థియేటర్లు మూతపడ్డాయని.. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక… కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దుగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. Sai pallavi

Also Read: రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

Post Corona symptoms: క‌రోనా నుంచి కోలుకున్నా ఈ ల‌క్ష‌ణాలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని సార్లు నెల‌లు గ‌డిచినా..