AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daughter Of Prasad Rao Movie: ఓటీటీలోకి ఎమోషనల్ థ్రిల్లర్ సిరీస్.. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ట్రైలర్..

ప్రస్తుతం రాజీవ్ కనకాల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ సిరీస్ ‘డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. ఇందులో వాసంతిక, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. దీనికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

Daughter Of Prasad Rao Movie: ఓటీటీలోకి ఎమోషనల్ థ్రిల్లర్ సిరీస్.. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ట్రైలర్..
Do Prasad Rao Kanabadutaled
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2026 | 6:43 AM

Share

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.

ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక ఈ మిస్టరీలు తేలాలంటే ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. జీ5లో ఈ మూవీని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us