AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaani Kapoor: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న ఆ స్టార్ హీరోయిన్.. తొలి ప్రాజెక్ట్‏కు వాణీ గ్రీన్ సిగ్నల్..

ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో సమంత ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. త్రిష, కాజల్, నయనతార, రష్మక, తమన్నా సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సందడి చేశారు. తాజాగా మరో హీరోయిన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. తనే హీరోయిన్ వాణీ కపూర్.

Vaani Kapoor: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న ఆ స్టార్ హీరోయిన్.. తొలి ప్రాజెక్ట్‏కు వాణీ గ్రీన్ సిగ్నల్..
Vaani Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2023 | 3:34 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ మెగా ప్రాజెక్ట్స్ హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చిత్రాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అటు థియేటర్లలోనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫామ్‎లోనూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు.. వెబ్ సిరీస్‏లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ హీరోహీరోయిన్స్ సైతం ఓటీటీలోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో సమంత ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. త్రిష, కాజల్, నయనతార, రష్మక, తమన్నా సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సందడి చేశారు. తాజాగా మరో హీరోయిన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. తనే హీరోయిన్ వాణీ కపూర్.

మర్దానీ 2 ఫేమ్ డైరెక్టర్ గోపీ పుత్రన్, మానవ్ రావత్ కలిసి దర్శకత్వం వహించనున్న వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఇందులో వాణీ కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. వాణీ కపూర్ కు ఓటీటీలో ఇది తొలి ప్రాజెక్ట్. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు ఓటీటీలో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వస్తున్న ఈ మండల మర్డర్స్ ను యశ్ రాజ్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

తన తొలి ప్రాజెక్ట్ మండల మర్డర్స్ కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు హీరోయిన్ వాణీ కపూర్. ఈ వెబ్ సిరీస్ తొలి షెడ్యూల్ త్వరలోనే మధ్యప్రదేశ్ లో ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.